జైపూర్, ఏప్రిల్ 29: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు కరోనా సోకింది. తనకు లక్షణాలేమీ లేవని, ఆరోగ్యం బాగానే ఉన్నట్టు ఆయన వెల్లడించారు. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గెహ్లాట్ సతీమణి సునీతకు బుధవారమే కరోనా నిర్ధారణ కావడంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.