న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో తన ఫాలోవర్లను ట్విట్టర్ తగ్గిస్తున్నదని ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్కు లేఖ రాశారు. గతంలో తన ట్విట్టర్ ఖాతాకు సరాసరి నెలకు 2.3 లక్షల మంది ఫాలోవర్లు జత అయ్యేవారని, ఒక్కోసారి 6.5 లక్షల వరకు చేరేదని తెలిపారు. అయితే గతేడాది ఆగస్టులో తన ఖాతాను ట్విట్టర్ వారం పాటు బ్లాక్ చేసిందని, ఆ తర్వాత నుంచి తన ఫాలోవర్ల సంఖ్య తగ్గుతూ వస్తున్నదని పేర్కొన్నారు. కేంద్రం ఒత్తిడితో కావాలనే ట్విట్టర్ తన ఫాలోవర్లను తగ్గిస్తూ వస్తున్నదని ఆరోపించారు.
రాహుల్ సభకు నలుగురు ఎంపీల డుమ్మా
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం అమృత్సర్లో నిర్వహించిన సభకు ‘జీ23’ నేత మనీశ్ తివారి, నలుగురు ఎంపీలు గైర్హాజరయ్యారు. సభకు వెళ్లడానికి తమకు సమస్య లేదని, అయితే పీసీసీ తమను పిలవలేదని ఎంపీ జస్బీర్సింగ్ చెప్పారు.
పంజాబ్ సీఎం అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తాం
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే తమ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. సీఎం ఎంపికపై పార్టీ కార్యకర్తలను సంప్రదించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.