వయనాడ్, ఏప్రిల్ 4: కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన ఆస్తులు రూ.20 కోట్లని అఫిడవిట్లో పేర్కొన్నారు. బుధవారం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు.
రూ.9,24,59,264 చరాస్తులున్నట్టు తెలిపారు. అలాగే స్థిరాస్థుల విలువ రూ.7,93,03,977గా చూపించారు. అలాగే స్వీయ, ఆర్జిత ఆస్తులుగా రూ.9,04,89000గా పేర్కొన్న రాహుల్.. వారసత్వంగా వచ్చిన ఆస్తుల విలువ రూ.2,10,13,598గా తెలిపారు. అలాగే తనకు రూ.49,79,184 అప్పులున్నట్టు పేర్కొన్నారు. తన దగ్గర కేవలం రూ.55వేల నగదున్నదని తెలిపారు. 2019లో రాహుల్ ఆస్తుల విలువ రూ.15,88,77,000 కాగా.. 2014లో రూ.9.40 కోట్లు ఉండేది.