పంజాబ్ ప్రముఖ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా ఇటీవల పంజాబ్లోని మాన్సా జిల్లాలో దారుణ హత్యకు గురయ్యారు. ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్తున్న జీపుపై ఇద్దరు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. 20 రౌండ్ల కాల్పులకు దిగడంతో సిద్ధూ స్పాట్లోనే చనిపోయాడు. ఈ వార్త అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అతడి పెంపుడు కుక్కలైతే సిద్ధూ కనిపించకపోవడంతో ముద్ద కూడా ముట్టడం లేదు. ఈ హృదయ విదారక వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
సిద్ధూ పెంపుడు కుక్కలు ఏమీ తినడం లేదు. వీడియోలో ఓ కుక్క విచారంగా మూలకు కూర్చోగా, మరో కుక్క బాధతో అరుస్తూ కనిపించింది. ఈ వీడియో నెటిజన్లకు కన్నీళ్లు తెప్పిస్తోంది. వీడియో చూసినవారంతా బ్రోకెన్ హార్ట్ ఎమోజీలతో కామెంట్ చేస్తున్నారు. ఈ రెండు పెంపుడు కుక్కలనీ సిద్దూ ఎంతో ప్రేమగా చూసుకునేవాడని అతడి కుటుంబ సభ్యులు చెప్పారు.