ఫిరోజ్పూర్, ఆగస్టు 21 : ‘బందీ సింగ్’లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ క్వామీ ఇన్సాఫ్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం పంజాబ్ రాష్ట్రంలో సంపూర్ణంగా బంద్ను నిర్వహించారు. మార్కెట్లు, దుకాణాలు, విద్యాసంస్థలు మూతపడగా, పలు చోట్ల రోడ్లను ఆందోళనకారులు దిగ్బంధించడంతో రహదారులపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బంద్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆందోళనకారులు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు బంద్నకు పిలుపునివ్వగా రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆందోళనకారులు జలంధర్, లుధియానాకు చెందిన లాదోవాల్, హోషియాపూర్, ఫిరోజ్పూర్లలో ధర్నాలు నిర్వహించారు. అలాగే పలు చోట్ల బైక్ ర్యాలీలు చేపట్టారు. 1990లలో పంజాబ్ తిరుగుబాటు సమయంలో తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తున్న సిక్కు ఖైదీలను ‘బందీ సింగ్లు’ అని పిలుస్తారు. వారిని విడుదల చేయాలని పంజాబ్ బంద్కు క్వామీ ఇన్సాఫ్ మోర్చా బంద్కు పిలుపునిచ్చింది.