Bhagat Singh | దేశ స్వాతంత్య్రం కోసం అలవోకగా ప్రాణాలొదిన విప్లవ నాయకుడు భగత్సింగ్పై పంజాబ్ లోక్సభ సభ్యుడు, అకాలీదళ్ (అమృత్సర్) పార్టీ నాయకుడు సిమ్రాన్జిత్ సింగ్ మాన్ అభ్యంతరకర వ్యాఖ్య చేశారు. భగత్సింగ్ ఉగ్రవాది అని పేర్కొన్నారు. ఒక ఇంగ్లిష్ నేవీ అధికారిని, సిక్కు పోలీస్ కానిస్టేబుల్ చన్నన్ సింగ్లను హత్య చేశాడని వ్యాఖ్యానించారు. జాతీయ అసెంబ్లీపై బాంబు విసిరిన భగత్సింగ్ ఉగ్రవాది కాదా? చెప్పండన్నారు. బీహార్, ఛత్తీస్గఢ్లలో గిరిజనులను నక్సల్స్ అని ఆరోపిస్తూ చంపడానికి వ్యతిరేకంగా ధ్వజమెత్తుతానన్నారు.
సిమ్రాన్జిత్ మాన్ వ్యాఖ్యలపై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వాతంత్య్ర సమర యోధుడిని అవమానించారని మండి పడింది. భేషరతుగా సిమ్రాన్జిత్ మాన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. స్వాతంత్య్ర సమర యోధుడు భగత్సింగ్ను ఉగ్రవాది సంగ్రూర్ ఎంపీ సిమ్రాన్జిత్ మాన్ అనడం బాధ్యతారాహిత్యం, అవమానకరం, అగౌరవం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని ట్వీట్ చేసింది.
`సిమ్రాన్జిత్ మాన్ వ్యాఖ్యలు సిగ్గుచేటు, భగత్సింగ్ ఒక వీరుడు, దేశభక్తుడు, ఇంక్విలాబ్ జిందాబాద్` అని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు. సిమ్రాన్జిత్ మాన్ వ్యాఖ్యలను పంజాబ్ మాజీ సీఎం సుఖ్జిందర్ సింగ్ రాంధావా తీవ్రంగా ఖండించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణ త్యాగం చేసిన యువ కిశోరం భగత్సింగ్ను నేడు ఉగ్రవాది అని పిలుస్తున్నారని మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలు అర్పించే వారిని, దేశానికి వ్యతిరేకంగా పోరాడే వారిని విడగొట్టి మాట్లాడటం నేర్చుకోండి అని వ్యాఖ్యానించారు.