చండీగఢ్: పంజాబ్ను డ్రగ్స్ మహమ్మారి వీడటం లేదు. ఇటీవల ఒక యువతి డ్రగ్స్ మత్తులో రోడ్డుపై కనిపించింది. తాజాగా మరో వ్యక్తి డ్రగ్స్ ప్రభావం వల్ల రోడ్డుపై నడవలేని స్థితిలో కనిపించాడు. సిక్కుల ప్రవిత్ర నగరమైన అమృత్సర్లో ఈ సంఘటన జరిగింది. చమ్రాంగ్ రోడ్డ్లో డ్రగ్స్ మత్తులో ఉన్న ఒక వ్యక్తి రోడ్డుపై తూలుతూ కదలలేని స్థితిలో ఉన్నాడు. స్థానికులు కొందరు ఈ వీడియోను రికార్డు చేశారు. అతడు డ్రగ్స్ ప్రభావంతో ఉన్నట్లుగా వారు పేర్కొన్నారు.
కాగా, అమృత్సర్లోని మక్బూల్పురా ప్రాంతం డ్రగ్స్ బానిసలకు నిలయంగా పేరుగాంచింది. ఈ నెల మొదట్లో ఒక యువతి ఈ ప్రాంతంలో డ్రగ్స్ ప్రభావంతో రోడ్డుపై తూలుతూ, కదలలేని పరిస్థితిలో కనిపించింది. నాడు కూడా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించి మక్బూల్పురా ప్రాంతంలో సోదాలు చేశారు. కొందరి ఇళ్ల నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
మరోవైపు డ్రగ్స్కు బానిస అయిన ఆ యువతిని కుటుంబ సభ్యులు వదిలేసినట్లు తెలిసింది. దీంతో అధికారులు ఆమెను అమృత్సర్లోని డీ అడిక్షన్ సెంటర్లో చేర్చారు.
Video: Punjab Man "Under Influence Of Drugs" Struggles In Public https://t.co/WA8RlFtfMs pic.twitter.com/lDj3CaZtxm
— NDTV (@ndtv) September 24, 2022