ఛండీగఢ్: పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఈ పేరుకు ఎన్నికల కమిషన్ అభ్యంతరాలు తెలుపలేదని, త్వరలోనే పార్టీని లాంఛనంగా ప్రారంభిస్తామని చెప్పారు. పార్టీ గుర్తు, విధివిధానాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అంతకుముందు ఆయన కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఏడు పేజీల రాజీనామా లేఖను పంపారు.