ముంబై: దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు అనేక కష్టాలు, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని పూణే పోలీసులు ఒక సందేశంతో కూడిన ఫొటోను శుక్రవారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మనసును హత్తుకునే ఈ ఫొటో, దాని క్యాప్షన్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
ఈ ఫొటోలో ఒక వృద్ధుడు రోడ్డు దాటడానికి ఒక వ్యక్తి సహాయపడతాడు. “ఇది దయతో చేసే చర్య. పూణే నగరంలో కనిపించే, కనిపించని కేర్కు ఇది నిదర్శనం. మనమంతా ఒకరికి ఒకరం సంరక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నాం ” అని అందులో పేర్కొన్నారు. #letstakecare # covid19 #weareinthistogether #punepolice #pune #actsofkindness అనే హ్యాష్ట్యాగ్లు పెట్టారు.
మరోవైపు పూణే పోలీసుల ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. పలువురు నెటిజన్లు లైక్ చేయడంతోపాటు పోలీసుల భావనకు మద్దతిస్తూ రీట్వీట్ చేశారు.