న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారులో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీ(Dr. Umar Nabi) అలియాస్ ఉమర్ మహమ్మద్ ఇంటిని ఇవాళ భద్రతా దళాలు కూల్చివేశాయి. కశ్మీర్లోని పుల్వామాలో ఉన్న ఆ ఇంటిని భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు కూల్చివేత ప్రక్రియ కొనసాగింది. పేలుడు పదార్ధాలు దాచేందుకు ఆ ఇంటి ఉమర్ నబీ వాడుకున్నట్లు గుర్తించారు. హుందయ్ ఐ20 కారుతో పేలుడుకు పాల్పడిన ఉమర్ నబీ.. డీఎన్ఏ శ్యాంపిళ్లను కన్ఫర్మ్ చేశారు. ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 13కాగా, 20 మందికిపైగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఎర్రకోట సమీపంలోని నేతాజీ సుభాష్ మార్గ్ వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పేలుడు ఘనట జరిగింది. ఉగ్రకార్యకలాపాలకు మద్దతు ఇచ్చే వారికి ఇలాంటి శిక్షే ఉంటుందన్న ఉద్దేశాన్ని తెలిపేందుకు ఉమర్ నబీ ఇంటిని పేల్చివేశారు. భారత భూభాగంపై ఉగ్రకార్యకలాపాలకు చోటు లేదన్న సంకేతాన్ని వినిపించారు.
VIDEO | Delhi terror blast: The residence of Dr Umar Nabi, accused in the Red Fort blast, has been demolished in Pulwama, Jammu and Kashmir.#Delhiblast #Pulwama #Terror
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/xJSVxkAZkY
— Press Trust of India (@PTI_News) November 14, 2025