పుదుచ్చేరి : కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు టీకా తప్పనిసరి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే చెప్తున్న విషయం విదితమే. కానీ కొందరు మాత్రం ప్రభుత్వాల విజ్ఞప్తులను పెడచెవిన పెడుతున్నారు. కరోనా టీకా వేయించుకునేందుకు ముందుకు రావట్లేదు. కొందరైతే టీకా తమకు వద్దని ఏడ్వడం చూశాం. ఇంకొందరైతే పారిపోయారు. అలా కొవిడ్ టీకా అనగానే భయపడుతున్న దృశ్యాలను రోజు ఏదో ఒక చోటు చూస్తూనే ఉన్నాం.
తాజాగా పుదుచ్చేరిలోని విలియనూరులో తనకు కొవిడ్ వ్యాక్సిన్ వద్దని పారిపోయాడు. ఎవరికీ కనిపించకుండా చెట్టెక్కి కూర్చున్నాడు. కరోనా టీకా ఇచ్చేందుకు తమ ఇంటి వైపు వస్తున్న ఆరోగ్య కార్యకర్తలను గమనించిన సదరు యువకుడు పారిపోయాడు. వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేసినప్పటికీ అతను వినిపించుకోకుండా చెట్టుపైనే ఉండిపోయాడు.