శ్రీహరికోట, జూన్ 30: పీఎస్ఎల్వీ సీ-53 ప్రయోగం విజయవంతమైంది. ఏపీలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి గురువారం ఈ ప్రయోగం నిర్వహించారు. పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా సింగపూర్కు చెందిన మూడు వాణిజ్య ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. వారం వ్యవధిలో ఇస్రో చేపట్టిన రెండో వాణిజ్య ప్రయోగం ఇది. పీఎస్ఎల్వీ-సీ53తో పాటు జూన్ 23న చేపట్టిన కమ్యూనికేషన్ శాటిలైట్ జీశ్యాట్-24 ప్రయోగాన్ని కూడా ఇస్రోకు చెందిన వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్) నిర్వహించింది. ఈ జీశ్యాట్-24 సేవలను డీటీహెచ్ సర్వీసు అందించే టాటాప్లేకు లీజ్కు ఇవ్వనున్నారు.