భోపాల్: పులిని దగ్గరి నుంచి వీడియో తీసిన బాలీవుడ్ నటి రవీనాటాండన్ చిక్కుల్లో పడ్డారు. సఫారీ టూర్లో ఆమె వాహనం పులికి దగ్గరగా వెళ్లడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. పులికి అత్యంత సమీపంగా వెళ్లి వీడియోలు తీయడంపై అధికారులు విచారణకు ఆదేశించారు.
రవీనాటాండన్ మధ్యప్రదేశ్లోని సాత్పురా టైగర్ రిజర్వులో సఫారీ టూర్కు వెళ్లారు. అక్కడ ఓ పులి కనిపించేసరికి దాని వీడియోలు, ఫోటోలు తీశారు. ఈ క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం పులికి దగ్గరగా వెళ్లింది. ఆ వీడియోలు, ఫోటోలను రవీనా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వాహనం డ్రైవర్కు, వీడియోలు తీసినప్పుడు అక్కడే ఉన్న అధికారులకు కూడా నోటీసులు ఇచ్చి ప్రశ్నించనున్నారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని ఎంతగానో ఇష్టపడే రవీనా.. తరచూ ఇలాంటి సఫారీలకు వెళ్తూ ఫోటోలు, వీడియోలు తీస్తుంటారు.