చంఢీఘడ్: కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేత, పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్ భార్య ప్రిణీత్ కౌర్(Preneet Kaur) ఇవాళ బీజేపీలో చేరనున్నారు. బీజేపీ టికెట్పై ఆమె పాటియాలా స్థానం నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ప్రిణీత్ కౌర్ వయసు 79 ఏళ్లు. ఆమె నాలుగు సార్లు ఎంపీగా చేశారు. గతంలో కేంద్ర విదేశాంగ సహాయ మంత్రిగా చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆమెను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ప్రిణీత్ కౌర్ భర్త అమరిందర్ సింగ్ గత ఏడాది పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇటీవల పార్లమెంట్లో దుమారం రేపిన మహువా మొయిత్రా కేసులో .. ఆమె సస్పెన్షన్ను సమర్థిస్తూ ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ప్రిణీత్ కౌర్ సపోర్టు ఇచ్చారు.