చెన్నై: డీఎండీకే నూతన ప్రధాన కార్యదర్శిగా ప్రేమలత విజయకాంత్ గురువారం ఎన్నికయ్యారు. పార్టీ వ్యవస్థాపకుడు, ఆమె భర్త ‘కెప్టెన్’ విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పార్టీ జనరల్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీ తిరువేర్కడులో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నాయి.
ఈ సమావేశంలో విజయకాంత్ కూడా పాల్గొన్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీకి ఆమె నాయకత్వం వహిస్తారని తెలిపాయి. ఆమె ప్రస్తుతం పార్టీ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. విజయకాంత్ నవంబరు 18 నుంచి డిసెంబరు 11 వరకు దవాఖానలో చికిత్స పొందారు.