లక్నో : టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్కు హాజరైన ఓ మహిళకు బాబుకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన బాబుకు వైద్యులు ‘టెట్’గా నామకరణం చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని అమ్రోహ జిల్లాలో చోటు చేసుకున్నది. నంద్పుర్ బిటా గ్రామానికి చెందిన రేణుదేవి అనే మహిళ ఆదివారం ప్రభుత్వం నిర్వహించిన టెట్ పరీక్షకు హాజరైంది. ఆమె నిండు గర్భిణి కాగా.. భర్త సహాయంతో గజ్రైలాలోని రమాభాయి అంబేడ్కర్ డిగ్రీ కళాశాలకు భర్త సాయంతో పరీక్షకు వెళ్లింది.
పరీక్ష రాస్తున్న సమయంలోనే సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రంలోని ఇన్విజిలెటర్ అప్రమత్తమై వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పురుడుపోశారు. రేణుదేవి మగబిడ్డకు జన్మనివ్వగా.. యూపీ టెట్ పరీక్షకు గుర్తుగా అప్పుడే పుట్టిన నవజాత శివువుకు ‘టెట్’గా నామకరణం చేశారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని మెడికల్ ఆఫీసర్ యోగేంద్ర సింగ్ పేర్కొన్నారు.