ప్రచారం: ఈ నెల 21న జరుగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేశారు. జూలై 9న ఈ పరీక్షను నిర్వహించనున్నారని పేర్కొంటూ పలు మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నది.
వాస్తవం: నీట్ పీజీ పరీక్ష వాయిదా వేసినట్టు జరుగుతున్న ప్రచారం అబద్ధమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చిచెప్పింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21న పరీక్ష జరుగుతుందని స్పష్టం చేసింది.