ముంబై, నవంబర్ 18: మహారాష్ట్ర, ముంబై నగర అభివృద్ధి కోసం తాను ఉరిశిక్షకైనా సిద్ధమని శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ ఆదిత్య ఠాక్రే అన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ముంబైలో ఓ వంతెనను ప్రారంభించారంటూ ఎంపీ ఆదిత్య ఠాక్రే, పార్టీ కార్యకర్తలపై కేసు నమోదైంది. ఈ ఘటనలో సీఎం ఏక్నాథ్ షిండే సర్కార్ వ్యవహరించిన తీరుపై ఠాక్రే మండిపడ్డారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మహారాష్ట్ర, ముంబై అభివృద్ధి కోసం పనిచేస్తే ప్రభుత్వం నాపై కేసులు పెట్టింది. ఈ ప్రభుత్వమే అక్రమంగా ఏర్పడ్డది. అలాంటిది అక్రమంగా వంతెనను ప్రారంభించానని నాపై కేసు పెట్టింది’ అని విమర్శించారు.