SIM Cards | దేశంలో సిమ్కార్డులకు సంబంధించిన నిబంధనలు మారాయి. ప్రస్తుతం సిమ్కార్డుల కొనుగోలు సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే చిక్కుల్లో పడే ప్రమాదం ఉన్నది. అయితే, మరీ ముఖ్యంగా పెద్ద మొత్తంలో ఒకేసారి సిమ్కార్డులు కొనుగోలుకు సంబంధించి మరింత కఠినంగా మారాయి. ఓ వ్యక్తి ఒకేసారి 198 సిమ్కార్డులను పంపుతుండగా లూథియానా పోలీసులు అరెస్టు చేశారు. సదరు నిందితుడిని గురుదాస్పూర్ వాసి అజయ్కుమార్ (30)గా గుర్తించారు. సదరు వ్యక్తి సిమ్కార్డును కొరియర్ ద్వారా కంబోడియాకు పంపేందుకు ప్రయత్నించగా.. పోలీసులకు సమాచారం అందింది. ఈ సిమ్లను సైబర్ రాకెట్ కోసం వినియోగించే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.
పోలీసులు నిందితుడిని అ దుపులోకి తీసుకొని విచారించగా.. హాంకాంగ్లోని ఓ రెస్టారెంట్లో వెయిటర్గా పని చేస్తున్న పేర్కొన్నాడు. అక్కడ కాల్ సెంటర్లో పని చేయమని కోరిన కొంతమందిని కలిశాడు.. భారత్కు చెందిన సిమ్కార్డులను పంపాలని కోరారని అజయ్ చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఇటీవల కేంద్రం సిమ్కార్డు రూల్స్ను మార్చివేసింది. ఇకపై ఎవరైనా ఒకే గుర్తింపుకార్డుపై తొమ్మిది కంటే ఎక్కువ సిమ్కార్డులు జారీ చేసినందుకు కఠినంగా శిక్షపడే అవకాశం ఉంది. నేరం రుజువైతే తొలిసారిగా రూ.50వేల జరిమా.. ఆ తర్వాత రూ.2లక్షల జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఎవరైనా మరొకరి గుర్తింపు కార్డుపై సిమ్కార్డును కొనుగోలు చేసి ఉపయోగిస్తే మూడేళ్ల వరకు జైలుశిక్ష.. రూ.50లక్షల జరిమానా విధిస్తారు. ఓ సమయంలో జైలుశిక్షతో పాటు జరిమానా విధించే ఛాన్స్ ఉంటుంది. సిమ్ కార్డును విక్రయించే ముందు.. బయోమెట్రిక్తో ఐడీ ధ్రువీకరణ తప్పనిసరి చేసింది.