కోల్కతా : పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ బెయిల్ పిటిషన్ను కోల్కతా ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు మంగళవారం తిరస్కరించింది. ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ అతడిని అరెస్టు చేసింది. నగలు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జూలై 23న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో గత ఏడాది జూలై 23 నుంచి కస్టడీలో ఉన్నాడు. పార్థ ఛటర్జీ చాలా కాలంగా కస్టడీలో ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది బెయిల్ కోసం దరఖాస్తు చేయగా.. కోర్టు తిరస్కరించింది. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ వాదించింది. ఈ క్రమంలో కోర్టు బెయిల్ను నిరాకరించింది.