డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఇవాళ కేదార్నాథ్లో పూజలు నిర్వహించారు. బాబా కేదార్కు ఆయన హారతి ఇచ్చారు. ఉదయం 8.30 నిమిషాలకు ఆయన కేదార్నాథ్ చేరుకున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రత్యేక వస్త్రధారణలో మోదీ ఆలయాన్ని విజిట్ చేశారు.
#WATCH | PM Narendra Modi performs 'puja' at the Kedarnath Dham
(Source: DD) pic.twitter.com/9i9UkQ5jgr
— ANI (@ANI) October 21, 2022
హిమాచల్ ప్రదేశ్కు చెందిన చంబా మహిళలు చేతితో తయారు చేసిన సంప్రదాయ డ్రెస్సు చోలా దొరను ధరించిన ఆయన ఆలయ దర్శనం చేసుకున్నారు. కేదార్నాథ్లో ఉన్న ఆది గురువు శంకరాచార్య సమాధిని కూడా ఆయన సందర్శించారు. గౌరికుండ్ నుంచి కేదార్నాథ్ వరకు రోప్వే ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
ఇవాళ సాయంత్రం బ్రదీనాథ్ కూడా మోదీ వెళ్లనున్నారు. అక్కడ కూడా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.