సూరజ్కుండ్, అక్టోబర్ 28: దేశంలోని అన్ని రాష్ర్టాల పోలీసులకు ఒకే తరహా యూనిఫాం ఉంటే బాగుంటుందని ప్రధాని మోదీ సూచించారు. అందరూ దీనిపై ఆలోచించాలనే ఉద్దేశంతోనే ఈ సూచన చేశానని వివరించారు. రాష్ర్టాలపై దీనిని రుద్దే ఆలోచన లేదని స్పష్టం చేశారు. సూరజ్కుండ్లో జరుగుతున్న రాష్ర్టాల హోంమంత్రుల చింతన్ శివిర్ను ఉద్దేశించి టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగించారు.
ఏకరీతి యూనిఫాం అనేది ఒక ఆలోచన మాత్రమేనని ఆయన అన్నారు. అది 5, 50, 100 ఏండ్లలో ఎప్పుడు సాకారమైనా ఫరవాలేదని అన్నారు. గన్నులు వాడే, పెన్నులు వాడే అన్నిరకాల నక్సలిజాలను సమూలంగా అంతమొందించాల్సి ఉన్నదని అన్నారు.