Narendra Modi : షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశాల్లో పాల్గొనాలంటూ చైనా నుంచి పిలుపు అందుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. మంగళవారం ఢిల్లీలో మోడీ చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యూ (Wang Yi)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చైనీస్ మినిస్టర్తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ప్రధాని చర్చించారు. అంతేకాదు ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతి స్థాపన దిశగా చర్యలు తీసుకోవాలనే అంశాన్ని కూడా మోడీ, వాంగ్ యూల మధ్య ప్రస్తావనకు వచ్చింది.
‘చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూను కలవడం చాలా సంతోషంగా ఉంది. నిరుడు ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్తో కజాన్లో భేటీ అయినప్పటి నుంచి భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి కనిపిస్తోంది. ఇరుదేశాలు తమతమ ప్రయోజనాలు, సున్నితమైన విషయాలను పరస్పరం గౌరవించుకుంటూ సాగుతున్నాయి.
Glad to meet Foreign Minister Wang Yi. Since my meeting with President Xi in Kazan last year, India-China relations have made steady progress guided by respect for each other’s interests and sensitivities. I look forward to our next meeting in Tianjin on the sidelines of the SCO… pic.twitter.com/FyQI6GqYKC
— Narendra Modi (@narendramodi) August 19, 2025
స్కో సమావేశం సమయంలో తియాంజిన్లో జరుగబోయే తదుపరి మా భేటీకోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. భారత్, చైనాల మధ్య ద్రుఢమైన, నిర్మాణాత్మకమైన బంధాలు ఆసియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శాంతి, సంతోషాల స్థాపనలో కీలకమవుతాయి’ అని మోడీ పేర్కొన్నారు. ప్రధానితో భేటీకి ముందు చైనా మంత్రి వాంగ్ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, విదేశాంగ మంత్రి జై శంకర్తో సమావేశం అయ్యారు.