ఇస్రో సైంటిస్టులకు, భారత ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇది 140 కోట్ల భారతీయుల విజయమని ప్రధాని కోనియాడారు. నేను బ్రిక్స్లో ఉన్నా.. నా మనసంతా చంద్రయాన్ మీదే ఉంది.. చంద్రయాన్ 3 విజయవంతమైన సందర్భంగా 1000 మంది ఇస్రో సిబ్బందికి నా అభినందనలు.. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూశాం.. ఇది ఎంతో అద్భుతమైన క్షణం.. చంద్రయాన్ 3తో భారత్ కొత్త చరిత్ర సృష్టించింది.. కళ్లముందు అద్భుతాన్ని చూశాము.. నా జీవితం ధన్యమైసంది. అమృత కాలంలో తొలి ఘనవిజయం ఇది.. ఈ విజయం దేశం గర్వించే మహోన్నత ఘట్టం.. అంటూ ప్రధాని మోదీ బ్రిక్స్ నుంచి మాట్లాడారు.