హైదరాబాద్ (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ‘త్రీ ఇడియట్స్’ సినిమా దృశ్యం తైవాన్-బ్యాంకాక్ విమానంలో పునరావృతమైంది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఓ గర్భిణికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. బాత్రూంలో ఆమెను చూసిన సిబ్బంది విషయాన్ని పైలట్ జాకరిన్కు తెలియజేశారు.
ల్యాండింగ్ చేద్దామంటే నడి సముద్రం పైన విమానం ప్రయాణిస్తున్నది. దీంతో తన బాధ్యతలను మహిళా కో-పైలట్కు అప్పగించిన జాకరిన్.. ఫోన్కాల్ ద్వారా వైద్యులను సంప్రదించి వారి సూచనలతో పురుడు పోశాడు. 30 వేల అడుగుల ఎత్తులో పుట్టిన చిన్నారికి సిబ్బంది ముద్దుగా ‘స్కై’ అని పేరు పెట్టారు.