ముంబై : ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వాంగ్మూలాన్ని ముంబైలోని కోలాబా పోలీసులు రికార్డు చేశారు. కోలాబా పోలీసులు కేసు విషయమై ఆయనకు శుక్రవారం రౌత్ను స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు పిలిచారు. ఇటీవల జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న సంజయ్ రౌత్ ఎక్కడ ఎన్నికలు జరిగినా చాలా మంది ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆరోపించారు. గోవాలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్పై తమకు చాలా సమాచారం అందిందని పేర్కొన్నారు.
సంజయ్ రౌత్ తన ట్వీట్లో ఐపీఎస్ అధికారి రష్మీ శుక్లా గురించి ప్రస్తావించారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ (ఎస్ఐడీ)కి నేతృత్వం వహిస్తున్న సమయంలో మహారాష్ట్ర నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సంజయ్ రౌత్పై ముంబై, పుణేలో కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో గత నెలలో ఇంటెలిజెన్స్ మాజీ ఛీప్ రష్మీ శుక్లా స్టేట్మెంట్ను సైతం ఇచ్చారు. అయితే, సంజయ్ రైత్ మహారాష్ట్ర నాయకుల ఫోన్లను ట్యాప్ చేసిన విధంగానే గోవాలో ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారంటూ ట్వీట్ చేశారు.