Cancer | చండీగఢ్ పీజీఐ నిపుణులు అరుదైన ఘనత సాధించారు. కీమో ఇవ్వకుండానే క్యాన్సర్ను నయం చేశారు. ఇన్స్టిట్యూట్లో దాదాపు 15 సంవత్సరాల పరిశోధన తర్వాత ఎట్టకేలకు విజయం సాధించారు. హెమటాలజీ విభాగం నిపుణులు అక్యూట్ ప్రోమిలోసైటిక్ లుకేమియా బాధితులకు కీమో ఇవ్వకుండానే పూర్తిగా నయం చేయగలిగారు. దీంతో కీమో థెరపీ లేకుండా క్యాన్సర్కు చికిత్స చేసిన ప్రపంచంలోనే తొలి దేశంగా భారత్ అవతరించింది. చండీగఢ్ పీజీఐ పరిశోధన బ్రిటిష్ జర్నల్ ఆఫ్ హెమటాలజీలో ప్రచురితమైంది.
పీజీఐ హెమటాలజీ విభాగం చీఫ్, పరిశోధన సీనియర్ రచయిత ప్రొఫెసర్ పంకజ్ మల్హోత్రా ప్రకారం.. వ్యాధి ఉన్న వారిలో ఆరోగ్య పరిస్థితి వేగంగా క్షీణిస్తుంది. రోగి రెండు వారాల పాటు తనను తాను జాగ్రత్తగా చూసుకుంటే.. చికిత్సకు సంబంధించిన సానుకూల ప్రభావాలు వేగంగా కనిపించడం ప్రారంభిస్తాయి. కానీ, ఆ రెరండువారాలు జీవించడం చాలాకష్టం. ఇప్పటి వరకు ప్రపంచంలో కేన్సర్ రోగులకు కీమోతో మాత్రమే చికిత్స అందిస్తుండగా.. తొలిసారిగా పీజీఐలో రోగులకు కేవలం మందుల ద్వారానే నయం చేయడం విశేషం. ఇందులో విటామిన్ ఏ, ఆర్సెనిక్ ట్రై ఆక్సైడ్ తదితర మెడిసిన్స్ ఉన్నాయి.
చండీగఢ్ పీజీఐలో దాదాపు 15 ఏళ్లుగా పరిశోధనలు జరిపారు. ఇందులో 250 మంది రోగులు పాల్గొన్నారని డాక్టర్ చరణ్ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. రోగులకు కీమోకు బదులుగా విటమిన్ ఏ, ఆర్సెనిక్ ట్రై ఆక్సైడ్ ఇచ్చారు. సీరియస్గా ఉన్న రోగులకు రెండేళ్లపాటు.. తక్కువ ప్రభావం ఉన్న రోగులకు నాలుగు నెలల పాటు ఆయా మందులు అందిస్తూ నిరంతరం పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు పరీక్షలు సైతం చేశారు. 250 మంది రోగుల పరిస్థితిని కీమో రోగులతో పోల్చి చూసిన సందర్భంలో ఫలితాలు మెరుగ్గా వచ్చాయి. కీమోతో పోలిస్తే.. ఈ చికిత్సా విధానంలో సక్సెస్ రేటు 90శాతం ఉన్నది. రెండువారాల్లో జీవించలేని రోగుల్లో మాత్రమే ప్రతికూల ఫలితాలు వచ్చాయి. 90శాతం మంది రోగులు పూర్తి ఆరోగ్యంగా ఉండగా.. సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.
కీమో క్యాన్సర్ కణాలను చంపుతుందని.. ఈ విధానం ఇతర అవయవాలపై సైతం దుష్ప్రభావాలను కలిగి ఉంటుందని వైద్యులు తెలిపారు. అయితే, విటామిన్ ఏ, మెటల్ కాంప్లిమెంటరీ ఎలిమెంట్స్ క్యాన్సర్ కణాల నిర్మాణ పరిస్థితిని పూర్తిగా నిర్మూలిస్తుంది. క్యాన్సర్కు కారణమయ్యే ట్రాన్స్ లొకేషన్పై దాడి చేస్తుంది. దీంతో ఇతర దుష్ప్రభావాలు ఉండవని.. సంక్రమణం ఆగిపోతుంది. క్రోమోజోమ్ల లొకేషన్లో మార్పుతో కొన్ని రసాయనాల ఓవర్యాక్టివిటీ కారణంగా ఈ క్యాన్సర్ వస్తుందని ప్రొఫెసర్ పంకజ్ చెప్పారు. విటమిన్-ఏ, ఆర్సెనిక్ ట్రై ఆక్సైడ్ క్రోమోజోమ్ల మ్యుటేషన్ ద్వారా ఉత్పత్తి అయ్యే రసాయనాలను అడ్డుకుంటాయి.
అక్యూట్ ప్రోమైలోసైటిక్ లుకేమియా (APL) అనేది తీవ్రమైన మైలోయిడ్ లుకేమియా (AML) ఓ రూపం. ఇది రోగి ఎముక మజ్జను ప్రభావితం చేస్తుంది. ఎముక మజ్జలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలను అభివృద్ధి చేసే మూల కణాలు ఉంటాయి. ఏపీఎల్ ఉన్న రోగుల ఎముక మజ్జ ప్రోమైలోసైట్లు అని పిలువబడే తెల్ల రక్త కణాల అపరిపక్వ రూపాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రోమైలోసైట్లు ఎముక మజ్జ లోపల ఏర్పడతాయి. ఆరోగ్యకరమైన తెల్ల రక్త కణాల ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఏపీఎల్ లక్షణం రక్తస్రావం రుగ్మత (కోగులోపతి)కి దారి తీస్తుంది. రక్తం గడ్డకట్టడం (థ్రోంబోసిస్) సైతం ఓ ప్రధాన లక్షణం. ఏపీఎల్, ఇతర రకాల లుకేమియాలో ఎముక మజ్జ ప్రాణాంతక కణాలతో నిండిపోతుంది. క్రియాత్మక కణాలను ఉత్పత్తి చేయలేకపోతుంది. క్రియాత్మక కణాలను ఉత్పత్తి చేయలేకపోతుంది.