బెంగళూరు: విమానాల్లో ప్రయాణించిన మహిళా ప్రయాణికుల సీట్లపై మూత్ర విసర్జన సంఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఒక ఆర్టీసీ బస్సు (Peeing incident in Bus) లో ఇలాంటి సంఘటన జరిగింది. ఒక వ్యక్తి మద్యం మత్తులో మహిళా ప్రయాణికురాలి సీటుపై మూత్ర విసర్జన చేశాడు. దీంతో ఆ మహిళ దీని గురించి బస్సు డ్రైవర్, కండక్టర్కు ఫిర్యాదు చేసింది. కర్ణాటకలోని హుబ్బళ్లి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ)కి చెందిన ఏసీ స్లీపర్ బస్సు విజయపుర నుంచి మంగళూరు బయలుదేరింది. అయితే డిన్నర్ కోసం కిరేసూరు సమీపంలోని ఒక దాబా వద్ద ఆ బస్సును ఆపారు. దీంతో బస్సులోని వారంతా భోజనం కోసం కిందకు దిగారు.
కాగా, ఆ బస్సులో ప్రయాణించిన 20 ఏళ్ల యువతి కూడా డిన్నర్ కోసం బస్సు దిగింది. అయితే ఆమె పక్క సీటులో ప్రయాణించిన 30 ఏళ్ల వ్యక్తి మద్యం మత్తులో ఆమె సీటుపై మూత్ర విసర్జన చేశాడు. డిన్నర్ తర్వాత బస్సు ఎక్కిన ఆ యువతి తన సీటు తడిగా ఉండటాన్ని గమనించింది. పక్క సీటులోని వ్యక్తి మూత్ర విసర్జన చేసినట్లు గ్రహించింది. బస్సు డ్రైవర్, కండక్టర్కు దీని గురించి చెప్పింది. దీంతో వారు ఆ వ్యక్తిని నిలదీశారు.
మరోవైపు బస్సులోని ఇతర ప్రయాణికులు కూడా ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తిని తిరిగి బస్సు ఎక్కనివ్వలేదు. అనంతరం ఆ ప్రయాణికురాలికి బస్సులో మరో సీటు కేటాయించారు. అయితే ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆమె ముందుకు రాలేదు.
Sukesh Chandrasekhar: జైలు గదిలో లగ్జరీ వస్తువులు.. బోరున ఏడ్చేసిన సుకేశ్ చంద్రశేఖర్.. వీడియో