Paytm Fastag | న్యూఢిల్లీ: పేటీఎం ఫాస్టాగ్ వాడుతున్న వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) బుధవారం కీలక సూచన చేసింది. టోల్గేట్ల వద్ద పెనాల్టీలు, డబుల్ చార్జీలు పడకుండా ఉండేందుకు గానూ మార్చి 15లోగా వేరే బ్యాంకు నుంచి ఫాస్టాగ్ తీసుకోవాలని స్పష్టం చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ విధించిన ఆంక్షల నేపథ్యంలో మార్చి 15 తర్వాత పేటీఎం ఫాస్టాగ్కు రీఛార్జ్, టాప్అప్ చేసుకోవడం కుదరదు.