తిరువనంతపురం: ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత పరస్సల బీ పొన్నమ్మాళ్ (96) మంగళవారం కన్నుమూశారు. వృద్ధాప్యంలో తలెత్తే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పొన్మమ్మాళ్ కేరళలోని వలియసాలలో ఉన్న తన ఇంట్లో మరణించినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె దాదాపు 8 దశాబ్దాలపాటు సంగీత ప్రియులను అలరించారు