చండీగఢ్: హర్యానాలోని నూహ్ జిల్లాలో సోమవారం జరిగిన మతపరమైన హింసాత్మక సంఘటనలపై (Haryana Violence) వలస ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాను వారు వీడుతున్నారు. కుటుంబాలతో కలిసి కాలి నడకన వెళ్తున్నారు. భయం వద్దని, భద్రత కల్పిస్తామని పోలీసులు చెబుతున్నా వెనక్కి తగ్గడం లేదు. తమ సొంతూర్లకు వెళ్లేందుకు వాహనాలు సమకూర్చాలని అధికారులను వేడుకుంటున్నారు. నూహ్తోపాటు దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన గురుగ్రామ్లో పలు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది వలస కార్మికులు పలు పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
కాగా, సోమవారం నూహ్ జిల్లాలో జరిగిన అల్లర్లు మంగళవారం నాటికి గురుగ్రామ్కు వ్యాపించాయి. షాపులు, రెస్టారెంట్లపై అల్లరి మూకలు దాడి చేశాయి. పలు షాపులను లూఠీ చేశారు. ఈ పరిణామాలపై వేలాది మంది వలస ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పారామిలిటరీ దళాలను మోహరించినప్పటికీ వారిలో భయం పోవడం లేదు. భద్రత కల్పిస్తామని పోలీసులు భరోసా ఇస్తున్నా ఫలితం లేదు. వందలాది వలస కార్మికులు తమ కుటుంబాలతో కలిసి నూహ్, గురుగ్రామ్ను వీడిపోతున్నారు. పోలీస్ ఆంక్షల వల్ల రవాణా సౌకర్యాలు తగినంతగా లేవు. ఈ నేపథ్యంలో తాము వెళ్లేందుకు వాహనాలు ఏర్పాటు చేయాలని వలస కార్మికులు కోరుతున్నారు.
#HaryanaViolence | Fear grips #Gurugram migrant workers. India Today’s @milan_reports talks to some of them to understand their issues. #5Live pic.twitter.com/ifY8LrS3ZN
— IndiaToday (@IndiaToday) August 3, 2023