న్యూఢిల్లీ: నిండుగా ప్రయాణికులున్న బస్సు రోడ్డు డివైడర్లోకి వేగంగా దూసుకెళ్లింది. దీంతో బస్సు ముందు భాగం సిమ్మెంట్ దిమ్మలోకి చొచ్చుకెళ్లింది. డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులతో సహా సుమారు పది మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. (Bus Rams Onto Divider) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. గురువారం బ్లూ లైన్లో నడిచే సిటీ బస్సు ప్రయాణికులతో కిటకిటలాడింది. రాజౌరి గార్డెన్ ప్రాంతంలో ఆ బస్సు అదుపుతప్పింది. డివైడర్లోకి వేగంగా దూసుకెళ్లింది. స్తంభాన్ని ఢీకొట్టడంతోపాటు అక్కడున్న సిమ్మెంట్ దిమ్మలోకి బస్సు చొచ్చుకెళ్లింది. దీంతో బస్సు ముందు భాగం బాగా ధ్వంసమైంది.
కాగా, ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్తోపాటు సుమారు పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు బస్సు ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
देखिए दिल्ली मे फिर दिखा ब्लू लाइन बस का कहर
डिवाइडर पर चढ़ी सवारियों से भरी ब्लू लाइन बस, मची अफरा-तफरी,दिल्ली के राजौरी गार्डन मे सवारियों से भरी बस मैन रोड डिवाइडर पर एक पोल से जा टकराई
बताया जा रहा है हादसे मै ड्राइवर और कंडक्टर को गंभीर चोट लगी और 10 से 12 सवारिया भी… pic.twitter.com/f3NKVQ8xeo
— Lavely Bakshi (@lavelybakshi) April 11, 2024