తిరువనంతపురం : పరుగుల రాణి పీటీ ఉషపై కేరళలోని కోజికోడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు మేరకు ఉషపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కోజికోడ్ పోలీసులు తెలిపారు. ఉషతో పాటు మరో ఆరుగురిపై సెక్షన్ ఐపీసీ 420 కింద కేసు నమోదైంది.
జెమ్మా జోసెఫ్ కోజికోడ్లో 1,012 చదరపు అడుగుల ఫ్లాట్ను ఓ బిల్డర్ నుంచి కొనుగోలు చేసింది. ఆ ఫ్లాట్ కోసం జోసెఫ్ వాయిదాల రూపంలో మొత్తం రూ. 46 లక్షలు చెల్లించింది. అయినప్పటికీ ఫ్లాట్ను బిల్డర్ జోసెఫ్కు అప్పగించలేదు. పీటీ ఉష హామీ మేరకే బిల్డర్కు డబ్బులు చెల్లించానని, కానీ ఫ్లాట్ ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని జోసెఫ్ పేర్కొన్నారు. బిల్డర్తో పాటు ఉష తనను మోసం చేశారని జోసెఫ్ తెలిపారు.