న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్లో ఈనెల 20వ తేదీన మూడవ దశ ఎన్నికలు జరగనున్నాయి. ఆ దశలో 627 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో 135 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఓ రిపోర్ట్ చెప్పింది. మొత్తం 623 మంది అభ్యర్థుల అఫిడవిట్లను ఎన్నికల వాచ్డాగ్ ఏడీఆర్ సమీక్షించింది. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థుల్లో అత్యధికంగా క్రిమినల్ కేసులు నమోదు అయినవారున్నారు.ఎస్పీలో 30 మంది, బీజేపీలో 25 మంది, బీఎస్పీలో 23 మంది, కాంగ్రెస్లో 20 మంది, ఆప్లో 11 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది. ఎస్పీ నుంచి 21, బీజేపీ నుంచి 20, బీఎస్పీ నుంచి 18, కాంగ్రెస్ నుంచి 10, ఆప్ నుంచి 11 మందిలో సీరియస్ క్రిమినల్ కేసులు నమోదు అయినట్లు ఏడీఆర్ చెప్పింది. మూడవ దశలో పోటీపడుతున్న వారిలో 245 మంది కోటీశ్వరులు ఉన్నారు. ఎస్పీలో 58, బీజేపీలో 48, బీఎస్పీలో 46, కాంగ్రెస్లో 29, ఆప్లో 18 మంది కోటీశ్వరులు ఉన్నారు. వీరి వద్ద కోటి కన్నా ఎక్కువ ఆస్తి ఉంది. ఎస్పీ నేత యశ్పాల్ సింగ్ యాదవ్ 70 కోట్లతో సంపన్నుడిగా నిలిచారు.