న్యూఢిల్లీ: పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రిగా ఇవాళ హర్దీప్ సింగ్ పురి బాధ్యతలు చేపట్టారు. మాజీ పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్.. ఈ సందర్భంగా ఆయన్ను కలిశారు. పెట్రోలియం శాఖ బాధ్యతలను హర్దీప్ సింగ్కు అప్పగిస్తున్నట్లు ధర్మేంద్ర ప్రదాన్ తన ట్వీట్లో తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ మీడియాతో మాట్లాడారు. స్వదేశీయంగా చమురు ఉత్పత్తి చేపట్టడంపైన తాము దృష్టి కేంద్రీకరించినట్లు మంత్రి హర్దీప్ తెలిపారు. ప్రధాని మోదీ చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ విజిన్కు లోబడి ఆ కార్యక్రమం సాగుతుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సహజవాయువులపై ఆధారపడే విధంగా అభివృద్ధి సాధిస్తామని ఆయన అన్నారు.