తిరువనంతపురం, మే 22: కేరళలో అంతర్జాతీయ అవయవ రాకెట్ ఒకటి బయటపడింది. హైదరాబాద్, బెంగళూరుతో పాటు పలు ప్రాంతాలకు చెందిన 20 మంది ఈ ముఠా బారిన పడి అవయవాలు పోగొట్టుకున్న వైనం వెలుగు చూసింది. ఇరాన్ నుంచి త్రిస్సూర్కు చెందిన సబిత్ నాజర్(30)ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతను ఇప్పటివరకు కేరళతో పాటు హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు చెందిన 20 మందిని గత ఐదు ఏండ్లుగా అక్రమంగా ఇరాన్ తరలించి వారి కిడ్నీలను అమ్మేవాడని, 5 లక్షలు కమీషన్గా తీసుకునేవాడని పోలీసులు తెలిపారు.