బెంగుళూరు : వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో విపక్ష పార్టీలు కొత్త కూటమిని ఏర్పర్చుకున్నాయి. ఆ పార్టీలన్నీ తమ కూటమికి ఐఎన్డీఐఏ అని పేరు పెట్టుకున్నాయి. ఇండియా అని ఆ కూటమికి పేరు పెట్టడాన్ని బీహార్ సీఎం నితీశ్ కుమార్(Bihar CM Nitish Kumar) వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. బెంగుళూరులో మంగళవారం సమావేశమైన వివిధ రాష్ట్రాల నేతలు ఆ కొత్త పేరుకు ఓకే చెప్పారు. కానీ కూటమిలోని కొన్ని పార్టీలు మాత్రం ఆ పేరును పెట్టడాన్ని తప్పుపట్టినట్లు తెలుస్తోంది. ఇండియా పేరు నచ్చని నితీశ్ను బుజ్జగించే ప్రయత్నాలు సాగినట్లు కూడా బయటకు పొక్కింది.
ఐఎన్డీఐఏ అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలియన్స్ అని అర్థం. అయితే బెంగుళూరు సమావేశం చర్చల సమయంలో ఆ పేరును నితీశ్ కుమార్ వ్యతిరేకించారు. ప్రతిపక్ష కూటమికి ఇండియా అని ఎలా నామకరణం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఆయన కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిటన్లు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమికి చెందిన అక్షరాలు కూడా కొత్త పేరులో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వామపక్ష నేతలు కూడా ఆ పేరును పెట్టేందుకు సందేహించినట్లు తెలుస్తోంది. వాళ్లు మరో పేరును సూచించారు.
అయితే చాలా వరకు పార్టీలు ఇండియా పేరుకే ఫిక్స్ కావడంతో.. బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా తలొగ్గినట్లు తెలుస్తోంది. ఆల్ రైట్.. మీకు ఆ పేరుతో ఓకే అయితే, అంతా మంచిదా అని చివరకు బీహార్ సీఎం అన్నట్లు కొన్ని వర్గాల ద్వారా వెల్లడైంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీలు.. ఇండియా పేరును ఫిక్స్ చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అయితే నామకరణం విషయంలో అన్ని ప్రతిపక్ష పార్టీల సూచనలు కోరారు.
ఐఎన్డీఐఏ పేరును మమతా బెనర్జీ ప్రతిపాదించినట్లు విదుత్తలై చిరుతైగల్ కట్చి చీప్ తోల్ తిరుమవాలవన్ తెలిపారు. అనేకసార్లు నిర్వహించిన సంప్రదింపుల తర్వాత తమ పేరును ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలియన్స్గా అంగీకరిచినట్లు చెప్పారు. ఇండియా అని కూటమి పేరును ఎందుకు పెట్టాలో రాహుల్ గాంధీ వెల్లడించినట్లు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రినేత్ తెలిపారు. ఇండియా పేరును రాహుల్ పెట్టారని, కానీ మమతా బెనర్జీ అధికారికంగా ప్రపోజ్ చేసినట్లు భావిస్తున్నారు.
ఇండియా కూటమికి ట్యాగ్లైన్ కూడా ప్రకటించారు. జీతేగా భారత్ అని ఆ కూటమి ట్యాగ్లైన్ ఫిక్స్ చేశారు. ట్యాగ్లైన్ హిందీలో ఉండాలన ఉద్ధవ్ సూచన చేశారు. ముంబైలో తదుపరి ఇండియా కూటమి మీటింగ్ జరగనున్నది.