ముంబై: ఒక వ్యక్తి వంతెనపై కారు ఆపాడు. ఆ తర్వాత వంతెన పైనుంచి సముద్రంలోకి దూకాడు (Man jumps into sea). ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి కోసం పోలీసులతోపాటు ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది కూడా హెలికాప్టర్లతో గాలిస్తున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. అరేబియా సముద్రం మీదుగా ఐదు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న బాంద్రా, వర్లీని కలిపే ఎనిమిది లైన్ల సీ లింక్ బ్రిడ్జీపై సోమవారం ఉదయం ఒక కారు ఆగింది. అందులోంచి దిగిన ఒక వ్యక్తి వంతెన పైనుంచి కింద ఉన్న సముద్రంలోకి దూకాడు. ఆత్మహత్యకు పాల్పడిన ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే ఇండియన్ నేవీ, కోస్ట్గార్డ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. సముద్రంలోకి దూకిన వ్యక్తి కోసం బోట్లు, హెలికాప్టర్ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. సీ లింక్పై నిలిచి ఉన్న కారు నంబర్ ప్లేట్ ఆధారంగా సముద్రంలోకి దూకిన వ్యక్తి గురించి తెలుసుకునేందుకు ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు.