భువనేశ్వర్ : ఒడిశాకు చెందిన ఓ తహసీల్దార్ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించింది. తన సోదరుడి వివాహ వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన బరాత్ కార్యక్రమంలో ఆ తహసీల్దార్ మాస్కు ధరించలేదు. అంతేకాకుండా.. అక్కడున్న వారితో కలిసి డ్యాన్స్ చేసింది. కరోనా కట్టడి కోసం ఒడిశా ప్రభుత్వం లాక్డౌన్ను అమలు చేస్తోంది. వివాహ వేడుకలకు కేవలం 25 మందికి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఓ మహిళా తహసీల్దార్ తన సోదరుడి వివాహానికి హాజరైంది. ఈ వేడుకలో లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా సదరు తహసీల్దార్ మాస్కు ధరించకుండా స్టెప్పులేసింది. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఈ వీడియోలపై జాజ్పూర్ జిల్లా కలెక్టర్ చక్రవర్తి సింగ్ రాథోడ్ స్పందించారు. ప్రస్తుతం ఆ మహిళా ఆఫీసర్ సెలవులో ఉన్నారు. సెలవులు ముగిసి వీధుల్లో హాజరైన తర్వాత ఆమె నుంచి వివరణ కోరి, తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఆఫీసరే.. నిబంధనలు ఉల్లంఘించడం సరికాదన్నారు.