భువనేశ్వర్: ఒడిశాలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. గంజామ్ జిల్లాలోని బంజానగర్ బ్లాక్లో ఉండే సారన్కుల్ గ్రామానికి చెందిన చాబి నాయక్ ఆ పిల్లలకు జన్మనివ్వడం విశేషం. నిజానికి గర్భం దాల్చిన సమయంలో ఆమె తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఉన్నది. ఆమె కండీషన్ సీరియస్గా ఉన్న నేపథ్యంలో కటక్లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీలో చికిత్స అందించారు. అక్కడ నిర్వహించిన రక్త పరీక్షల్లో ఆమెకు తీవ్రమైన రక్తహీనత, పచ్చ కామెర్లు ఉన్నట్లు తేలింది. అయితే ఆ కేసును ఎస్సీబీ డాక్టర్లు సీరియస్గా తీసుకున్నారు. గైనకాలజీ, హెమటాలజీ, హెప్టాలజీ శాఖలు.. అయిదుగురి ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టారు. డాక్టర్ తుషార్ కార్ నేతృత్వంలో.. చాబి నాయక్కు చికిత్స అందించారు. డాక్టర్ల అద్భుత సహకారం వల్ల.. ఆ మహిళ నలుగురు అమ్మాయిలకు జన్మనిచ్చింది. ఆరోగ్యపరిస్థితి సరిగా లేకున్నా.. నలుగురు పిల్లలను నార్మల్ డెలివరీ పద్ధతిలో కనడం ఆశ్చర్యమే. ప్రస్తుతం తల్లితో పాటు నలుగురు పిల్లలు కూడా క్షేమంగా ఉన్నారు.