కోల్కతా : ప్రముఖ కార్టూనిస్ట్ నారాయణ్ దేవ్నాధ్ (97) దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తుదిశ్వాస విడించారు. డిసెంబర్ 24న ఆస్పత్రిలో చేరిన నారాయణ్ అప్పటినుంచి వెంటిలేటర్పై ఉంటూ ఈరోజు ఉదయం 10.15 గంటలకు మరణించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఆయనకు పద్మశ్రీ సహా పలు ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. నారాయణ్ బెంగాల్లో పేరొందిన హాస్య క్యారెక్టర్లు బంటూల్ ది గ్రేట్, హండా భోండా, నాంటే ఫోంటే వంటి పాత్రలను తన సృజనాత్మకతతో సృష్టించారు. నారాయణ్ దేవ్నాధ్ మృతి పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ప్రముఖ కార్టూనిస్ట్, ఇలస్ట్రేటర్, సాహితీవేత్త నారాయణ్ దేవ్నాధ్ మరణించారనే వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె ట్వీట్ చేశారు. ఆయన మరణం సాహితీ లోకంతో పాటు కామిక్స్ ప్రపంచానికి తీరని లోటని అన్నారు. నారాయణ్ దేవ్నాధ్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, పాఠకులు, అభిమానులకు మమతా బెనర్జీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.