రోజురోజుకీ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ సర్కార్ అలర్ట్ అయ్యింది. నెల నెలా ప్రభుత్వ ఉద్యోగులు జీతం తీసుకోవాలంటే తమ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపించాల్సిందేనని నిబంధన విధించింది. తమ తమ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను చూపిస్తేనే ఉద్యోగులు తమ జీతాలను పొందుతారని పంజాబ్ సర్కార్ బుధవారం స్పష్టం చేసింది. రెండు డోసులు తీసుకున్నా, ఒక డోసు తీసుకున్నా, ఆ సర్టిఫికెట్ను ప్రభుత్వ పోర్టల్లో అప్లోడ్ చేయాలని, అప్పుడే జీతం వస్తుందని తేల్చి చెప్పింది. అయితే ఇప్పటి వరకూ వ్యాక్సినేషన్ జోలికే వెళ్లని ఉద్యోగుల విషయంలో ఎలాంటి చర్యలు చేపడతారన్న విషయాన్ని మాత్రం ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదు.