న్యూఢిల్లీ, ఆగస్టు 2: రైతుల రుణాలను మాఫీ చేసే ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ రైతుల రుణాలను కూడా మాఫీ చేసే యోచన లేదని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ సోమవారం లోక్సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2008 నుంచి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వ్యవసాయ రుణమాఫీ పథకాన్ని అమలు చేయలేదని పేర్కొన్నారు. రైతులపై రుణ భారాన్ని తగ్గించడానికి, వ్యవసాయ రంగంపై ఆధారపడినవారి సంక్షేమానికి కేంద్రం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) పలు చర్యలు చేపట్టాయని తెలిపారు.