న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: జార్ఖండ్లో అన్హరత వేటు ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సొరేన్ అనర్హతపై ఎన్నికల కమిషన్ తన అభిప్రాయాన్ని గవర్నర్ రమేశ్ బైస్కు పంపగా.. తాజాగా ఆయన సోదరుడు ఎమ్మెల్యే బసంత్ సొరేన్ అనర్హత వేటు తెరపైకి వచ్చింది. బసంత్ సొరేన్ ఓ మైనింగ్ కంపెనీలో భాగస్వామి అని, ఈ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించలేదని, కాబట్టి ఆయనపై అనర్హత వేటు వేయాలని గవర్నర్కు బీజేపీ ఫిర్యాదు చేసింది.
స్పందించిన గవర్నర్ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఎన్నికల కమిషన్ను కోరారు. దీంతో ఈసీ తన అభిప్రాయాన్ని గవర్నర్కు పంపింది. అందులో ఈసీ ఏమని సూచించిందో బయటికి తెలియదు. ఇప్పుడు అన్నదమ్ముల భవిష్యత్ గవర్నర్ చేతిలో ఉన్నది. హేమంత్ సొరేన్, బసంత్ సొరేన్లపై అనర్హత వేటు వేస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉన్నది.