బెగూసరాయ్, ఫిబ్రవరి 16: ప్రధానమంత్రి కావాలన్న కోరిక తనకు అస్సలు లేదని బీహార్ సీఎం నితీశ్కుమార్ చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘2024లో బీజేపీని ఓడించడమే మా లక్ష్యం. ఇందుకోసం ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నా. అంతేగానీ ప్రధాని కావాలన్న ఆశ లేదు’ అని తెలిపారు. డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ కూడా ఇదే మాట చెప్పారు. విపక్షాల ఐక్యతే నితీశ్ లక్ష్యమని వెల్లడించారు.