న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) శతాబ్ది ఉత్సవాలు (centenary celebrations) నేటితో ముగియనున్నాయి. ముగింపు వేడులకు ప్రధాని మోదీ (PM Modi) ముఖ్య అతిథిగా హాజరుకానున్నాయి. దీంతో వర్సిటీ అధికారులు విద్యార్థులకు హాజరు తప్పనిసరి (Compulsory attendance) చేయడంతోపాటు నలుపు రంగు దుస్తులు (Black dresses) ధరించకూడదంటూ మార్గదర్శకాలు జారీచేశారు. అదేవిధంగా అనుబంధ కాలేజీలు తప్పనిసరిగా ప్రధాని కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించింది. హిందూ కాలేజీ, డాక్టర్ భీం రావ్ అంబేద్కర్ కాలేజీ, జాకీర్ హుస్సేన్ ఢిల్లీ కాలేజీల్లో ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో హిందూ కాలేజీ టీఆర్ ఇన్చార్జ్ మీను శ్రీవాత్సవ.. ఏడు పాయింట్లతో కూడిన ఓ నోటీసు విడుదల చేశారు. అందులో ఐడీ కార్డు ధరించాలని, నలుపు రంగు దుస్తులు వేసుకోకూడదంటూ అందులో పేర్కొన్నారు. ఇక ప్రధాని కార్యక్రమానికి విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేశారు. హాజరైనవారికి అదనంగా ఐదు రోజులపాటు అటెండెన్స్ వేస్తామని పేర్కొన్నారు. కాగా, ఈ విషయమై కాలేజీ అధికారులను అడగగా.. తాము ఎలాంటి నోటీసులు విడుదల చేయలేని వెల్లడించారు.
కాగా, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి పాల్గొనే సమావేశంలో నల్ల దుస్తులు ధరించకూడదని, సెల్ఫోన్లు తీసుకురావద్దని పెరియార్ యూనివర్సిటీ ఈ నెల 24న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గత బుధవారం సేలం జిల్లాలోని యూనివర్సిటీలో జరగిన ఓ కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు.