పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ సహనం కోల్పోయారు. మద్యం మరణాలపై అసెంబ్లీలో బుధవారం ప్రశ్నించిన బీజేపీ సభ్యులపై ఆయన మండిపడ్డారు. ‘మీరే తాగుబోతులు.. మద్య నిషేధం గురించి మీరా మాట్లాడేది?’ అని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. అయితే నినాదాలు చేస్తున్న వారిపై సీఎం నితీశ్ కుమార్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం జరిగింది? నిశ్శబ్దంగా ఉండండి. వారిని సభ నుంచి బయటకు పంపండి’ అని అన్నారు.
కాగా, బీహార్లోని సరణ్ జిల్లా ఛప్రాలో ఇటీవల కల్తీ మద్యం తాగి పలువురు మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరుగవచ్చని తెలుస్తున్నది. అయితే వారి మరణాలపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడైన బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ సిన్హా, బీహార్ రాష్ట్రంలో అమలు చేస్తున్న మద్య నిషేధంపై అసెంబ్లీలో పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో సీఎం నితీశ్ కుమార్ సహనం కోల్పోయారు. ‘మద్య నిషేధం గురించి మీరా మాట్లాడేది.. మీరే పెద్ద తాగుబోతులు’ అన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Bihar CM Nitish Kumar loses his temper in State Assembly as LoP Vijay Kumar Sinha questions the state govt's liquor ban in wake of deaths that happened due to spurious liquor in Chapra. pic.twitter.com/QE4MklfDC6
— ANI (@ANI) December 14, 2022