Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఉదయం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్కు తన రాజీనామా లేఖను సమర్పించారు. రాష్ట్రంలో తాము మహాకూటమితో పొత్తును తెంచుకోవాలని నిర్ణయించుకున్నామని ఆయన గవర్నర్కు తెలిపారు. ఉదయం జేడీయూ ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం నితీశ్ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్కు రాజీనామా లేఖ ఇచ్చారు.
నితీశ్ రాజీనామాకు గవర్నర్ అర్లేకర్ ఆమోదం తెలిపారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించారు. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్కుమార్ బీజేపీతో కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎంగా మళ్లీ ఆయనే ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో ఏం జరుగుతుందనేది మరి కొన్ని గంటల్లో తేలే అవకాశం ఉన్నది. గవర్నర్కు రాజీనామా లేఖ ఇచ్చిన అనంతరం నితీశ్కుమార్ మీడియాతో మాట్లాడారు. తాను గవర్నర్ను కలిసి సీఎం పదవికి రాజీనామా చేశానని, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరానని తెలిపారు. దేశంలో INDIA కూటమి బలహీన పడిందని వ్యాఖ్యానించారు.
#WATCH | Patna | Bihar outgoing CM and JD(U) president Nitish Kumar says, “Today, I have resigned as the Chief Minister and I have also told the Governor to dissolve the government in the state. This situation came because not everything was alright…I was getting views from… pic.twitter.com/wOVGFJSKKH
— ANI (@ANI) January 28, 2024
#WATCH | Bihar CM and JD(U) president Nitish Kumar arrives at the Raj Bhavan in Patna. pic.twitter.com/xq6FWg67lr
— ANI (@ANI) January 28, 2024
#WATCH | Bihar CM and JD(U) president Nitish Kumar leaves from his residence in Patna. pic.twitter.com/76CYbBtm8C
— ANI (@ANI) January 28, 2024