హైదరాబాద్ : సుపరిపాలనను ప్రోత్సహించడానికి, స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు, ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్(ఎన్ఐఆర్డీ పీఆర్), హైదరాబాద్ శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్సీసీజీ)న్యూఢిల్లీతో ఒప్పందం కుదుర్చుకున్నది.అందుకోసం మెమోరాండంపై సంతకం చేసింది.
ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యం పలు అంశాలపై సహాయ సహకారాలు అందించుకోవడంతోపాటు
ఈ రెండు జాతీయ సంస్థల బలాబలాల ఆధారంగా మెరుగైన సుపరిపాలన అందించడానికి అవసరమైన నాలెడ్జ్ ను ఇచ్చిపుచ్చుకోనున్నాయి.ఈ ఎంఓయూ సంతకాల కార్యక్రమం ఆన్లైన్లో జరిగింది. ఈ ఒప్పందంపై ఎన్ఐఆర్డీ పీఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి.నరేంద్ర కుమార్,ఎన్సీసీజీ డైరెక్టర్ జనరల్ వి.శ్రీనివాస్ సంతకాలు చేశారు.