సిమ్లా: అటవీ ప్రాంతంలోని జింక పిల్లను ఒక కొండచిలువ మింగింది. (Nilgai Calf Swallowed By Python) కొందరు వ్యక్తులు దీనిని గమనించారు. కొండచిలువ మింగిన జింక పిల్లను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే కొండచిలువ కడుపులోంచి బయటకు వచ్చిన జింక పిల్ల అప్పటికే మరణించింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తుల ప్రవర్తన చర్చకు దారి తీసింది. హిమాచల్ ప్రదేశ్లోని ఉనా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక జింక పిల్లను కొండచిలువ మింగడాన్ని కొందరు వ్యక్తులు గమనించారు. ఈ నేపథ్యంలో దానిని కాపాడేందుకు ప్రయత్నించారు. కదలలేని స్థితిలో ఉన్న కొండచిలువను పట్టుకుని దానిని కడుపును బాగా ఊపారు. దీంతో అది మింగిన జింక పిల్ల మెల్లగా నోటి నుంచి బయటకు వచ్చింది. అయితే ఆ జింక పిల్ల అప్పటికే చనిపోయింది. వారి ప్రయత్నం వృథా అయ్యింది.
కాగా, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ ఈ వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘వన్య ప్రాణులుండే సహజ ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఇలా చేయడం సరైనదేనా? వారు మంచి పనే చేశారా? అని ప్రశ్నించారు. దీంతో నెటిజన్లు స్పందించారు. ఆ వ్యక్తుల తీరును కొందరు విమర్శించారు.
మరోవైపు కొండచిలువ మింగిన జింక పిల్ల చనిపోయిందని, దానిని రక్షించడంలో ఏమి అర్థం ఉందని ఒకరు ప్రశ్నించారు. కొంత మంది వ్యక్తుల ప్రవర్తన ఇలా ఉంటుందని మరొకరు మండిపడ్డారు. ‘ఇది ప్రకృతికి విరుద్ధం. ప్రతి జీవికి ఆహారాన్ని సంపాదించుకునే హక్కు ఉంది. కాబట్టి, వాటి సహజ ప్రపంచంలో జోక్యం చేసుకోవడం సరికాదు’ అని మరొకరు వ్యాఖ్యానించారు.
In a recent viral video some locals try to save a Nilgai calf after it was swallowed by a python. What do you think; is it right to interfere like this in natural world. Or they did right thing. pic.twitter.com/Qgxk0MPUq0
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) October 12, 2024